హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ, పంచాయతీరాజ్ చాంబర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు వైబీ రాజేంద్రప్రసాద్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు రావడంతో విజయవాడలోని రమేశ్ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆయనకు అక్కడ చికిత్స పొందుతున్నారు. రాజేంద్రప్రసాద్ను టీటీడీ అధినేత చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణహాని లేదని వైద్యులు వివరించారు.