సంగారెడ్డి : అందోల్లో(Andol) అభివృద్ధి పనులను ఆపాలని మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodara ) చూస్తున్నారని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్(Former MLA Kranti Kiran) ఆరోపించారు. మంగళవారం ఆయన సంగారెడ్డిలో మీడియా సమావేశంలో మంత్రిపై నిప్పులు చెరిగారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆందోల్ నియోజకవర్గంలో ఎస్డీఎఫ్, సీడీపీ నిధులతో అభివృద్ధి పనులు చేశాను.
80 శాతం వరకు గ్రామాల్లో సీసీ రోడ్లు వేయించానని తెలిపారు. కొన్ని టెండర్లు పూర్తవగా మరికొన్ని పనులు నడుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పనుల్ని ఆపాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారని ఆరోపించారు. మంజూరు అయిన నిధులు సరిపోకపోతే ఇంకా నిధులు ఇవ్వండి. కానీ పనులను మాత్రం ఆపవద్దన్నారు. అభివృద్ధి పనుల్లో రాజకీయ కక్షసాధింపు చర్యలు సరికావని హితవు పలికారు. అభివృద్ధికి మంత్రి సహకరించాలని కోరారు.