భూపాలపల్లి రూరల్, జనవరి 20 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని మంజూర్నగర్లో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం పూర్తి అయిన సందర్భంగా మొక్కు తీర్చుకునేందుకు పాదయాత్రగా తిరుమల కొండకు వెళ్తున్నట్టు ఆమె తెలిపారు. ఈ పాదయాత్రను మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శనివారం జెండా ఊపి ప్రారంభించారు.