హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): ఐటీ రంగంలో దూసుకుపోతున్న తెలంగాణ నుంచి సాయాన్ని అందుకునేందుకు విదేశాలు క్యూ కడుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో ఒమన్ చేరింది. తమకు అవసరమైన ఐటీ పరిజ్ఞానాన్ని పొందేందుకు ఆ దేశం తెలంగాణ ఇన్నోవేషన్ అడాప్షన్ కొలాబరేషన్ సెల్ (టీఐఎసీసీ)తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.
వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ (డబ్ల్యూఐటీసీ) ఆధ్వర్యంలో సోమవారం సింగపూర్లో జరిగిన సదస్సులో తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, టీఎస్టీఎస్ చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావు, డబ్ల్యూఐటీసీ చైర్మన్ సందీప్కుమార్ మక్తాలతోఒమన్ యువరాజు ఫిరాస్ బిన్ ఫాతిక్, వ్యవసాయ శాఖ మంత్రి దలాల్ ప్రత్యేకంగా సమావేశమై ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అనంతరం జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. ఐటీ రంగంలో తెలంగాణ దేశానికే రోల్ మాడల్గా నిలిచిందన్నారు. ఒమన్ యువరాజు ఈ నెల 13న భారత పర్యటనకు వస్తున్నారని, అందులో భాగంగా ఆయన హైదరాబాద్ను కూడా సందర్శించనున్నారని తెలిపారు.