మహదేవపూర్, ఆగస్టు 28 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబటిపల్లిలో ఉన్న మేడిగడ్డ(లక్ష్మీ) బరాజ్కు వరద కొనసాగుతున్నది. శుక్రవారం 1,08,500 క్యూసెక్కుల ప్రవాహం రాగా, మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
బరాజ్ గరిష్ఠ ప్రవాహం బరాజ్ రివర్ బెడ్ నుంచి సముద్ర మట్టానికి 100 మీటర్లు కాగా, ప్రస్తుతం 90.50 మీటర్లలో ఉందని భారీనీటిపారుదల శాఖ ఈఈ సరేశ్ తెలిపారు.