శ్రీరాంపూర్, జూన్ 21: సింగరేణి సంస్థ విస్తరణలో భాగంగా మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిల్వ నీటిపై తేలియాడే సోలార్ విద్యుత్తు ప్లాంటు ఏర్పాటుకు యాజమాన్యం నిర్ణయించిందని డైరెక్టర్ (ఈఅండ్ఎం) సత్యనారాయణరావు పేర్కొన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ప్రాంత పర్యటనలో భాగం గా ఆయన మీడియాతో మాట్లాడారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టులో నీటిపై తేలియాడే సోలార్ విద్యుత్తు ప్లాంటు ఏర్పాటుకు 120 ఎకరాలు గుర్తించినట్టు చెప్పారు. 600 మెగావాట్ల ప్లాంటు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందని, మొదటి విడుతగా 38 శాతం ఈ ప్రాంతంలోనే సోలార్ ప్లాంటు ఏర్పాటుకు నిర్ణయిం చినట్టు తెలిపారు. కరీంనగర్ మానేరు డ్యాంలో నీటిపై తేలి యా డే సోలార్ విద్యుత్తు ప్లాంట్ ఏర్పాటుకు అనుమతులు వచ్చా యని, సర్వే, డీపీఆర్ పూర్తయ్యిందని ఆయన వివరించారు.