సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ఈనెల 25వ తేదీ రాత్రి 10 నుంచి 26వ తేదీ రాత్రి 10 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు నగరంలోని పలు ప్రాంతా ల్లో నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని జలమండలి ఎండీ ఒక ప్రకటనలో తెలిపారు. జలమండలి నీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేస్-3 రింగ్మెయిన్ టోలిచౌకి ప్రాం తంలోని ఎస్బీఐ బ్యాంకు నుంచి ఆర్చీస్ స్టోన్ వరకు గల 1400 ఎంఎం డయా ఎమ్ఎస్ పంపింగ్ మెయిన్కు జంక్షన్ పనులు చేపడుతున్నందున షేక్పేట్, జూబ్లీహిల్స్, ఫిల్మ్నగర్, ప్రశాసన్నగర్, తట్టిఖాన,గచ్చిబౌలి, మా దాపూర్, అయ్యప్ప సొసై టీ, కావూరిహిల్స్ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని జలమండలి ఎండీ పేర్కొన్నారు.