కాళేశ్వరం, జూలై 6 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం, అన్నారం గ్రామాల్లో చేపల వాన కురిసింది. మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం కురిసిన వానతో పాటు చేపలు నేలపై పడ్డాయి. కాళేశ్వరంలో కొంతమంది భక్తులు అస్థికలు కలిపి వస్తుండగా రోడ్డుపై చేపలు పడి ఉండటం గమనించి తమ వెంట తీసుకెళ్లారు. అన్నారంలో రోడ్డుపై పడి ఉన్న చేపలను గ్రామస్థులు చూసి ఆశ్చర్యపోయారు.