హైదరాబాద్, జూన్ 13(నమస్తే తెలంగాణ): ప్రజలకు చేప వంటకాలను చేరువ చేయడంతోపాటు చేపల వినియోగం పెంచే దిశగా మత్స్య ఫెడరేషన్ చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నూతన కలెక్టరేట్లతోపాటు రద్దీ ప్రాంతాలు, చిన్న, పెద్దపర్యాటక ప్రాంతాల్లోనూ క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. ఆ క్యాంటీన్లను మహిళా గ్రూపులకు కేటాయించాలని, వివి ధ పథకాల ద్వారా పెట్టుబడిలో 60 శాతం సబ్సిడీ ఇప్పించనున్నారు. ‘కలెక్టరేట్లు పర్యాటక, రద్దీ ప్రాంతాల్లో ఫిష్ క్యాంటీన్ల ద్వారా చేపల వంటకాలను కూడాప్రజలకు చేరువ చేయాలని భావిస్తున్నాం’ అని మత్స్యశాఖ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ తెలిపారు.