వరంగల్: వరంగల్ చౌరస్తాలోని ఓ రెస్టారెంట్లో (Restarent) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని మను ఫుడ్ రెస్టారెంట్లో శుక్రవారం ఉదయం మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి రెస్టారెంట్ మొత్తానికి విస్తరించాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంలో రెస్టారెంట్తోపాటు మూడు షాపులు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరుగనప్పటికీ.. భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.