హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో కలకలం రేపిన ఉగ్రజాడలపై దర్యాప్తు వేగవంతమైంది. హైదరాబాద్సహా, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భోపాల్ యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ (ఏటీఎస్), రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసుల సీన్ రీకన్స్ట్రక్షన్ మంగళవారం ముగిసింది. హైదరాబాద్, సిద్దిపేట, మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో హిజ్బ్ ఉత్ తహ్రీర్ సంస్థకు చెందిన ర్యాడికల్ ఇస్లామిస్టులు తిరిగిన ప్రాంతాలు, వారు ఉన్న ప్రదేశాలు, సమావేశాలు నిర్వహించిన స్థలాలు, శిక్షణ ఇచ్చిన ప్రాంతాల్లో క్షుణ్ణంగా సీన్ రీ కన్స్ట్రక్షన్ చేసినట్టు తెలిసింది.
అలాగే నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు పలు చోట్ల సోదాలు జరిపారు. హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో జరిపిన ఈ సీన్ రీ కన్స్ట్రక్షన్, సోదాల్లో పలు కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. భోపాల్ నుంచి తీసుకొచ్చిన ఇస్లామిస్టులతో సాయంత్రమే హైదరాబాద్ నుంచి భోపాల్కు తిరిగిన ప్రయాణమయ్యారు. మరింత సమాచారం, పక్కా ఆధారాల కోసం రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా భోపాల్ వెళ్లినట్టు విశ్వసనీయంగా తెలిసింది.