హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): 2023-24 బడ్జెట్పై రాష్ట్ర ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది. బడ్జెట్ అంచనాలు సిద్ధం చేయాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇటీవల ఆయా శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. పన్నులు, సుంకాలు, రుసుములు తదితర వాటిలో పెరుగుదల, తగ్గుదలలో ప్రభుత్వం ఆమోదించిన రేట్లను ప్రతిపాదనల్లో పొందుపరచాలని సూచించారు. ఈ నేపథ్యంలో బుధవారం బడ్జెట్ ప్రతిపాదనలపై రామకృష్ణారావు సమావేశం నిర్వహించనున్నారు. ఆయా శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ప్రభుత్వ కార్యదర్శులు బడ్జెట్ అంచనాలతో సమావేశానికి హాజరుకావాలని సూచించారు.