లింగాల, జూన్ 4: తెలంగాణ సంస్కృతి, అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కించిన బలగం సినిమా కొన్ని కుటుంబాల్లో కదలికలు తీసుకొస్తున్నది. నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రానికి చెందిన అన్నదమ్ములు లోసారి మల్లయ్య, లోసారి లిక్కిడయ్య కొన్నేండ్ల కిందట మరణించారు.
వీరిరువురి కుటుంబీకులు వివిధ ప్రాంతాల్లో జీవనం కొనసాగిస్తున్నారు. వీరి బంధువులు నల్లగొండ శ్రీనివాసులు, ప్రభాకర్ ముందుకొచ్చి అన్నదమ్ముల సంతానాన్ని ఒకే వద్దకు చేర్చారు. దాదాపు 150 మంది సహపంక్తి భోజనాలు చేశారు. బలగం సినిమా తమ కుటుంబాల మధ్య ఉన్న బంధాలను గుర్తుచేసిందని, అందుకే కలుసుకున్నామని వారు తెలిపారు.