హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): కరువును తట్టుకొని ఎలా నిలబడాలి, వలసలను ఎలా నియంత్రించాలనే అంశంపై ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చ ర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏవో) చర్యలు చేపట్టింది. ఈ అంశంపై నా లుగు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలుకు ఇటీవల వ్యవసాయ శాఖతో కలిసి నిర్ణయించిం ది. తొలి దశలో ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు ఆదిలాబాద్, నారాయణపేట్, నిజామాబాద్, మహబూబ్నగర్ జిల్లాలను ఎంపిక చేసుకున్నది. ఈ జిల్లాల్లోని ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించనున్నది. ముఖ్యం గా ఒకే ఆదాయ వనరుపై ఆధారపడకుండా వారికి తగిన సూచనలు, సలహాలు ఇవ్వనున్నది. కరువు పరిస్థితులు ఏర్పడిన్పటికీ ప్రజలు ఆర్థిక ఇబ్బందులను అధిగమించేలా వారికి తర్ఫీదు ఇవ్వనున్నది.