హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : పాఠశాల విద్యలో ప్రవేశపెట్టిన ఎక్స్టర్నల్ మూల్యాంకనంతో బోధనకు విఘాతం కలుగుతుందని ఎస్టీయూ టీఎస్ అభిప్రాయపడింది. ఈ విధానం నిరంతర సమగ్ర మూల్యాంకనానికి విరుద్ధమని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీ సదానందం, ప్రధాన కార్యదర్శి గజేందర్ అభిప్రాయపడ్డారు.
బాహ్య మూల్యాంకనం పేరుతో అసలు సమస్యలను అధికారులు పక్కదారి పట్టిస్తున్నారని టీఎస్ యూటీఎఫ్ ప్రకటనలో అభిప్రాయపడింది.