హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువును ఈనెల 4వరకు పొడిగించినట్టు గురువారం ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ శ్రుతి ఓజా తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పేమెంట్ గేట్వే, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ వంటి సదుపాయాలు వినియోగించుకోవాలని సూచించారు.