హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): నిరుటి వానకాలం సీజన్కు సంబంధించిన సీఎమ్మార్ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఫిబ్రవరి 29 వరకు గడువు ఇస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గడువు జనవరి 31తోనే ముగియగా, ఇంకా ఎఫ్సీఐకి ఇవ్వాల్సిన బియ్యం 3 లక్షల టన్నులకు పైగా పెండింగ్లో ఉన్నది. దీంతో గడువును పొడిగించాల్సిందిగా సివిల్ సైప్లె కమిషనర్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు గడువును పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. ఇదే చివరి అవకాశమని, మరోసారి పొడిగించబోమని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నది.