హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మైనార్టీ వ్యవహారాల శాఖ సలహాదారుడు, విశ్రాంత ఐపీఎస్ ఏకే ఖాన్ పదవీకాలాన్ని ప్రభుత్వం మరో రెండేండ్లు పొడిగించింది. సీఎస్ సోమేశ్కుమార్ శుక్రవా రం ఉత్తర్వులు జారీ చేశారు. ఏకే ఖాన్ పదవీకాలం ఈ నెల 31తో ముగియనుండటంతో ఈ నిర్ణయం తీసుకొన్నది.