బెంగళూరు, అక్టోబర్ 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి): టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టడం శుభ పరిణామమని మాజీ ప్రధాని, జనతాదళ్-ఎస్ అధినేత హెచ్డీ దేవేగౌడ అన్నారు. బీజేపీని గద్దె దించి దేశాన్ని కాపాడాలంటే కేసీఆర్ వంటివారితోనే సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. జాతీయ రాజకీయాలపై దేవేగౌడ ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధితో ముచ్చటించారు.
మనస్పూర్తిగా స్వాగతిస్తున్నాను. చాలా మంచి పరిణామం. జాతీయ రాజకీయాల్లో కొన్ని పక్షాల పెత్తనం మంచిది కాదు. అనేక రాజకీయ పక్షాలు జాతీయస్థాయిలో చురుగ్గా ఉన్నపుడే ప్రజాస్వామ్యానికి మేలు. కేసీఆర్ ఇదివరకే తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించి విజయం సాధించారు. జాతీయ రాజకీయాల్లో కూడా బలమైన ముద్ర వేస్తారు.
భాష, నీటి పంపిణీ, నిధుల విడుదల తదితర అంశాలను సూక్ష్మంగా పరిశీలిస్తే సమాఖ్య వ్యవస్థకు బీజేపీ హాని చేస్తున్నదని అర్థమవుతూనే ఉన్నది. బీజేపీ ప్రతిదాన్నీ రాజకీయ కోణంతోనే చూస్తున్నది. ఇది మంచిది కాదు. ఒక రాజకీయ పక్షం రాజ్యాధికారాన్ని చేపట్టిన తర్వాత అందరినీ కలుపుకొని పోవాలి. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి. కేంద్రం అలా వ్యవహరించకపోవటం బాధాకరం.
ఇందులో అనుమానమే లేదు. కాంగ్రెస్ చేసిన తప్పుల వల్ల ఇప్పుడు ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది. నిత్యావసరాల ధరల పెరుగుదల, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ప్రజలను విభజించి పాలించే విధానం, తదితర సమస్యలపై పార్లమెంటు లోపల, బయట కాంగ్రెస్ పెద్ద ఎత్తున పోరాడాల్సి ఉండె. కానీ, అందులో విఫలమైంది. ఇప్పుడు దేశంలో బీజేపీ ప్రబలేందుకు కారణం కాంగ్రెస్ వైఫల్యాలే అనటంలో సందేహం లేదు. మరో వైపు టీఆర్ఎస్, జేడీ(ఎస్) వంటి ప్రాంతీయ పక్షాలు బీజేపీని బలంగా ఎదిరిస్తున్నాయి.
దీని గురించి చెప్పాల్సిన పనేలేదు. సత్యాన్ని ఎంతోకాలం కప్పిపుచ్చలేరు. మధ్య, దిగువ మధ్యతరగతి కుటుంబాలు రోజురోజుకూ ఆర్థికంగా కుంగి పోతున్నాయి. మరోవైపు ఎంపిక చేసిన కొందరు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు వేగంగా ధనవంతులవుతున్నారు.
బీజేపీ అధికారంలోకి వస్తే దేశ ప్రజలకు అచ్చేదిన్ వస్తుందని భరోసా ఇచ్చారు. లేనిపోని ఆశలు పుట్టించారు. అచ్చేదిన్ వచ్చిందా? పన్నుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తామని జీఎస్ట్టీ తెచ్చారు. ఇది ప్రజానీకానికి పెనుభారమైంది. దేశంలో పన్నురాజ్ వ్యవస్థ వచ్చినట్టయ్యింది. నిత్యావసర సరకుల ధరలను నియంత్రిస్తామన్నారు. అదీ కాలేదు. ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరలు 70 ఏండ్ల గరిష్ఠానికి చేరాయి. ఎన్నో ఆశలు పుట్టించిన మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీ పథకాలు విఫలమయ్యాయి.
అస్సలు అవగాహన లేదు. పరిశ్రమలు, వ్యాపారాలమీద ఉన్నంత ఆసక్తి.. సేద్యం, గ్రామీణ వ్యవస్థపై లేదు. రైతులకు వ్యతిరేకంగా మూడు వ్యవసాయ చట్టాలు తెచ్చారు. రైతులు వాటికి వ్యతిరేకంగా 13 నెలలు పోరాడాక దేశానికి క్షమాపణ చెప్పి వాటిని ఉపసంహరించారు. సేద్యం, రైతుల పట్ల శ్రద్ధ ఉంటే అన్నదాతల పోరాటాన్ని కొనసాగనిచ్చేవారు కాదు. దేశంలో పేదలు, ధనవంతుల మధ్య అంతరాలు నానాటికీ పెరుగుతున్నాయి.
ఇందులో అనుమానానికి తావు లేదు. ఇప్పుడు దేశ స్వాతంత్య్ర అమృత మహోత్సవాన్ని జరుపుకొంటున్నాం. కాంగ్రెస్ తర్వాత బీజేపీయే సుదీర్ఘకాలం పాలన సాగించింది. ప్రజల ఆశలు, ఆకాంక్షలను ఈ రెండు పార్టీలు ఏమేరకు నెరవేర్చా యో గణాంకాలే చెప్తున్నాయి. మోదీ పాలనలో ఉపాధి, శాంతి భద్రతలు, సేద్యం, సాగు నీరు, సుస్థిర జీవనం తదితర రంగాల్లో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. వీటిని ఈడేర్చాలనే సంకల్పం కొరవడింది.
తప్పకుండా సహకరిస్తాం. చాలాకాలంగా కేసీఆర్ పరిపాలన తీరును గమనిస్తున్నా. ఏ విధమైన కపటం లేకుండా కుండ బద్ధలు కొట్టినట్టు మాట్లాడుతారు. చెప్పాలనుకున్న దానిని చాలా సూటిగా, సరళంగా, స్పష్టంగా, నికచ్చిగా చెప్తారు. బీజేపీ ప్రభుత్వం గత ఏడేండ్లలో అమలుచేసిన విధానాల వల్ల ప్రజలు నానా ఇబ్బందులకు గురయ్యారు. దీని గురించి కేసీఆర్ గట్టిగా గొంతు విప్పారు. కొన్ని నెలల కిందట బెంగళూరులో నన్ను కలిసి మాట్లాడినపుడూ ప్రజా సమస్యల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యల సాధనకు, ప్రజా సమస్యల పరిషారానికి ఆయన చేస్తున్న ప్రయత్నం, సాగుతున్న మార్గం సరైనవే. ఆయనకు మా మద్దతు, సహాయ, సహకారాలు ఉంటాయి.