Harish Rao | హైదరాబాద్ : రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు లేఖ రాశారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు ఇప్పటి వరకు ఎందుకు సమాధానాలు ఇవ్వలేదని స్పీకర్ను హరీశ్రావు ప్రశ్నించారు. నక్షత్రం గుర్తు లేని ప్రశ్నలకు అసెంబ్లీ బిజినెస్ రూల్స్ 52(10) ప్రకారం.. రాతపూర్వ సమాధానాలు టేబుల్పై ఉంచాలని గుర్తు చేశారు. గత అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకు ఇప్పటి వరకు సమాధానం రాలేదని హరీశ్రావు తెలిపారు. రాష్ట్ర నియోజకవర్గ ప్రయోజనాల కోసం సభలో ప్రశ్నలు అడగడం, సకాలంలో సమాధానాలు పొందడం సభ్యుల హక్కు అని ఆయన స్పష్టం చేశారు. తాము అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానం ఇచ్చేలా అధికారులను ఆదేశించాలని స్పీకర్ను హరీశ్రావు కోరారు.