హైదరాబాద్ : సిద్దిపేట కలెక్టర్ పదవికి రాజీనామా చేసిన ఐఏఎస్ ఆఫీసర్ వెంకట్రామిరెడ్డి బీఆర్కే భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనుకున్నాను. కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రానికి సేవ చేస్తాను. కేసీఆర్ నుంచి పిలుపు వచ్చాక టీఆర్ఎస్ పార్టీలో చేరుతానని వెంకట్రామిరెడ్డి ప్రకటించారు.
తెలంగాణ రావడం ఒక అదృష్టం. వచ్చిన తెలంగాణను సీఎం కేసీఆర్ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తి, ఆలోచన విజన్ తనను ఎంతో ప్రభావితం చేశాయి. కేసీఆర్ ప్రభుత్వం ప్రజల కోసం కృషి చేస్తోందన్నారు. సుమారు ఏడేండ్లు సిద్దిపేట జిల్లాలో పని చేశాను అని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.