హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య (Rosaiah) భౌతికకాయానికి మాజీ సీఎం నాదేండ్ల భాస్కర్ రావు నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. రోశయ్య తాను కలిసి చాలా క్యాబినెట్లలో పనిచేశామని గుర్తుచేసుకున్నారు. తమవి పక్కపక్క ఊర్లేనని చెప్పారు. కలిసే పరీక్షలు రాశామని, ఉన్నత చదువుల కోసం తాను హైదరాబాద్ వచ్చానని చెప్పారు. ఆయన మాత్రం గుంటూరులోనే చదువుకున్నారని వెల్లడించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి పల్లంరాజు, సినీనటుడు చిరంజీవి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. రోశయ్య భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.