హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నేటి నుంచి చేపట్టనున్న రిలే దీక్షలను వాయిదా వేసింది. విద్యుత్తు యాజమాన్యం టీజీపీఈజేఏసీని చర్చలకు ఆహ్వానించింది. ఈనెల 29న (శనివారం) టీజీపీఈజేఏసీని విద్యుత్తు యాజమాన్యం చర్చలకు పిలిచిన నేపథ్యంలో గురువారం నుంచి తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు వాయిదా వేసినట్టు టీజీపీఈజేఏసీ చైర్మన్ సాయిబాబా, సెక్రటరీ జనరల్ శ్రీధర్, కన్వీనర్ రత్నాకర్రావు వెల్లడించారు.