MLC Kavitha | హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ మంగళవారంతో ముగియనున్నది. దీంతో ఈడీ అధికారులు బుధవారం ఉదయం 11.00 గంటలకు ఆమెను ఢిల్లీ రౌస్ ఎవెన్యూలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరుచనున్నారు. ఈ సందర్భంగా ఈడీ తనను అక్రమంగా అరెస్ట్ చేసిందని కవిత మరోమారు న్యాయస్థానానికి తెలియజేయనున్నారు.
కేవలం రాజకీయ కక్షతో నమోదైన కేసు అని వివరించనున్నారు. తనను విడుదల చేయాలని కోరనున్నారు. ఈడీ అధికారులు ఈ నెల 15న కవితను అరెస్ట్ చేసి 16న కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే. మొదట వారం రోజులు కస్టడీ విధించిన కోర్టు.. 23వ తేదీన మరో మూడు రోజులు పొడిగించింది.