హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఈడీ దర్యాప్తును వేగవంతం చేసింది. గురువారం హైదరాబాద్లోని ఈడీ ఆఫీసులో శంకరలక్ష్మి, సత్యనారాయణ విచారణకు హాజరయ్యారు. సుమారు 4 గంటలు ఇ ద్దరినీ వేర్వేరుగా ప్రశ్నించారు. ఇద్దరి వాంగ్మూలాలు నమోదు చేశారు. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని ఈడీ అధికారులు సూచించినట్టు తెలిసింది.