హైదరాబాద్: ప్రముఖ వ్యాపారవేత్త కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఎండీ పార్థసారథిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. మనీలాండరింగ్ వ్యవహారంపై సీసీఎస్లో నమోదైన కేసు ఆధారంగా బెంగళూరులో ఆయను ఈడీ అధికారుల అదుపులోకి తీసుకున్నారు. అటునుంచి హైదరాబాద్కు తరలించారు.
ఇన్వెస్టర్లకు సంబంధించిన షేర్లను వారి అనుమతి లేకుండా కార్వీ స్టాక్ బ్రోకింగ్ తన ఖాతాల్లోకి మళ్లించుకుని, వాటిపై బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న విషయం తెలిసిందే. వాటిని కార్వీ ఎండీ పార్థసారథి తన రియల్ ఎస్టేట్ సంస్థల్లోకి మళ్లించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ఈడీ దర్యాప్తు చేస్తున్నది.
కాగా, ఇండస్ఇండ్ బ్యాంకుకు అప్పు ఎగవేసిన కేసులో పార్థసారథిని పోలీసుల గతేడాది ఆగస్టులో అరెస్టు చేశారు. బ్యాంకు నుంచి రూ.137 కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టడంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.