హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): దుండిగల్ పోలీస్స్టేషన్ రాష్ట్రంలో ఉత్తమ స్టేషన్గా నిలిచింది. కేంద్ర హోంశాఖ ప్రతి ఏటా దేశవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లకు ర్యాంకులు ప్రకటిస్తుంది. ఇందులో భాగంగా 2022వ సంవత్సరానికి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ను ఉత్తమ ఠాణాగా ఎంపిక చేసింది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ జారీచేసిన సర్టిఫికెట్ను సోమవారం డీజీపీ అంజనీకుమార్ సైబరాబాద్ పోలీసులకు అందజేశారు. అనంతరం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్టేషన్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. సిబ్బంది సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైనదని సీపీ కొనియాడారు.