తొర్రూరు, డిసెంబర్ 30: కుటుంబ కలహాలతో ఓ మహిళ తన భర్తపై వేడి నీళ్లు పోసి గాయపర్చింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కొమ్మనపల్లికి చెందిన యాకూబ్-సరోజ దం పతుల మధ్య నాలుగేండ్లుగా గొడవలు జరుగుతున్నాయి.
ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు ఇవ్వాలని సరోజ శుక్రవారం యాకూబ్ను అడగ్గా, నిరాకరించాడు.ఈ క్రమంలో కూలికి వెళ్లి వచ్చి స్నానానికి పెట్టుకున్న వేడినీళ్లను భర్తపై పోసింది. ఘటనపై తొర్రూర్ పీఎస్లో కేసు నమోదైంది.