హైదరాబాద్, మార్చి 25 (నమస్తేతెలంగాణ): దుబాయ్లో నివాసం ఉంటున్న చార్టెడ్ అకౌంటెంట్ ఎం.హనుమంతకుమార్ శుక్రవారం టీటీడీకి రూ.కోటి విరాళంగా అందించారు. తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డిని కలిసి డీడీ అందజేశారు. ఈ విరాళాన్ని ఏ ట్రస్ట్కైనా జమచేసుకోవాలని దాత కోరారు.
టీటీడీ గో సంరక్షణ ట్రస్ట్కు శుక్రవారం సికింద్రాబాద్కు చెందిన పద్మావతి సొల్యూషన్స్ అధినేత శ్రీధర్ రూ.10,01,116 విరాళంగా అందించారు. తిరుమలలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కలిసి డీడీని అందజేశారు. గో సంరక్షణకు టీటీడీ చేపట్టిన చర్యలకు సంతోషించి ఈ విరాళం అందించినట్లు దాత తెలిపారు.