హనుమకొండ, నవంబర్ 11: సీటీఆర్ఐ నూతన డైరెక్టర్గా వరంగల్లోని గిర్మాజీపేటకు చెందిన డాక్టర్ మాగంటి శేషు మాధవ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. దేశంలోనే అత్యున్నత సంస్థ అయిన అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డు (ఏఎస్ఆర్బీ) ఇటీవల నిర్వహించిన డైరెక్టర్స్ ఇంటర్వ్యూలో రాజమహేంద్రవరంలోని కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థకు నూతన డైరెక్టర్గా శేషు మాధవ్ ఎంపికయ్యారు.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రిసెర్చ్ (ఐఆర్ఆర్ఐ), హైదరాబాద్లోని బయోటెక్నాలజీ విభాగంలో మాలిక్యులర్ బయాలజీ, జెనెటిక్స్, ప్లాంట్ బ్రీడింగ్ అంశాల్లో అత్యుత్తమ పరిశోధనలు చేపట్టి, పలు జాతీయ అంతర్జాతీయ అవార్డులతోపాటు అనేక అంతర్జాతీయ పత్రికల్లో వ్యాసాలు రాశారు. శేషు మాధవ్ తొలుత సీటీఆర్ఐలో శాస్త్రవేత్తగా అడుగుపెట్టి 22 ఏండ్లపాటు పనిచేసి తిరిగి ఆ సంస్థకే డైరెక్టర్గా ఎంపిక కావడం విశేషం.