హైదరాబాద్ : రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న దోస్త్ మొదటి విడుత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల గడువు పొడిగింపబడింది. జులై 24 వరకు ఇందుకు అవకాశం కల్పిస్తున్నట్లు దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. ఈ నెల 31న డిగ్రీ మొదటి విడత సీట్ల కేటాయింపు జరగనున్నట్లు చెప్పారు. బుధవారం వరకు 1,17,601 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వెల్లడించారు. కాగా ఆగస్టు 1 నుంచి 9వ తేదీ వరకు దోస్త్ రెండో విడత రిజిస్ట్రేషన్లు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆగస్టు 2 నుంచి 9 వరకు రెండో విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం. ఆగస్టు 14న రెండో విడత సీట్ల కేటాయింపు జరగనున్నట్లు లింబాద్రి తెలిపారు.
ఆధార్తో అనుసంధానమై ఉన్న మొబైల్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. మీ-సేవా కేంద్రాలు, రాష్ట్రంలోని 105 సహాయ కేంద్రాలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, వర్సిటీల్లోని సహాయ కేంద్రాల ద్వారా దోస్త్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చాన్నారు. అదేవిధంగా tsappfolio ద్వారా దోస్త్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఫేస్బుక్, ట్విట్టర్లోనూ ఫిర్యాదులను పరిష్కరిస్తున్నామని చెప్పారు. దోస్త్ యూట్యూబ్ చానల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.