మేడ్చల్ మల్కాజిగిరి : జవహర్నగర్ పట్టణ ప్రజలకు ఇచ్చిన మాట, చేసిన వాగ్ధానాన్ని ఎన్నటికీ మరువనని, నేటి నుంచి ఏడాదిలోపు జవహర్నగర్ కార్పొరేషన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చుపిస్తానని మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు.
ఆదివారం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, జవహర్నగర్ మేయర్ మేకల కావ్యతో కలిసి రూ. 8.20 కోట్లతో రోడ్ల అభివృద్ధి, సెంట్రల్ మీడియన్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. జవహర్నగర్ అంటే నా గుండె కాయ. నా ప్రాణం. పేద ప్రజలు నివసించే ఈ ప్రాంతాన్ని తప్పకుండా ఏడాదిలోపు రోడ్డు, డ్రైనేజీలతో పాటు ప్రధాన రోడ్డును విద్యుత్ దీపాలతో జిగేల్ మనిపించేలా దీర్చిదిద్దే బాధ్యతన నాతో పాటు కార్పొరేషన్ పాలవర్గంపై ఉందన్నారు.
కరోనా కారణంగా గత సంవత్సరం కాలం పాటు కార్పొరేషన్లో అభివృద్ధి కుంటు పడిందన్నారు. చెన్నాపురం చౌరస్తా నుంచి వికలాంగుల కాలనీ డబుల్ బెడ్రూంల వరకు రూ.1.20 కోట్లతో రోడ్డు విస్తరణ పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. రూ. 3 కోట్లతో చేపట్టే రోడ్లు డ్రైనేజీ పనులను మరో వారం రోజుల్లో ప్రారంభిస్తామని తెలిపారు.
వచ్చే సంవత్సరం ఏప్రిల్ 1 వరకు జవహర్నగర్లో సకల సౌకర్యాలు కల్పిస్తానని మాట ఇస్తున్నట్లు ప్రకటించారు. కార్పొరేషన్లో రెండు ఎకరాల్లో మోడల్ మార్కెట్ ఏర్పాటుకు రూ. 4కోట్ల మంజురయ్యాయని త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు.
కార్యక్రమంలో , డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్రెడ్డి, డీఈ కృష్ణ, మేనేజర్ నగేష్ బాబుతో కార్యకర్తుల పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
బహుజన తత్వవేత్త జ్యోతిరావు పూలే : మంత్రి పువ్వాడ
‘మల్లన్న’ క్షేత్రంలో భక్తుల కోలాహాలం
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే : మంత్రి ఐకే రెడ్డి
గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి రావు ఫూలే