హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థ ‘క్యూనెట్’కు టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ప్రచారం చేయడంపై ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇలాంటి సంస్థలను సెలబ్రిటీలు ప్రమోట్ లేదా సపోర్టు చేయొద్దని సలహా ఇచ్చారు. క్యూనెట్ లాంటి మల్టీలెవల్ మార్కెటింగ్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటున్నదని తెలిపారు. సజ్జనార్ గతంలో హైదరాబాద్ సీపీగా ఉన్నప్పుడు క్యూనెట్ సహా పలు మల్టీలెవల్ మార్కెటింగ్ కంపెనీలపై చర్యలు తీసుకొన్నారు.