హైదరాబాద్,జనవరి27 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎప్సెట్ కన్వీ నర్గా జేఎన్టీయూహెచ్ సివిల్ ఇంజినీరింగ్ విభా గం హెచ్వోడీ ప్రొఫెసర్ డీన్కుమార్ ఎంపిక య్యారు. ఎప్సెట్తోపాటు మరో 6 ప్రవేశ పరీ క్షల సెట్స్ కన్వీనర్లను ఉన్నత విద్యామండలి చైర్మ న్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి శనివారం ప్రక టించారు. పీజీఈసెట్ కన్వీనర్గా ప్రొఫెసర్ ఏ అరుణకుమారి (జేఎన్టీయూ), ఐసెట్ కన్వీనర్గా ప్రొఫెసర్ నర్సింహాచారి (కేయూ), ఈసెట్ కన్వీనర్గా ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ (ఓయూ), లాసెట్ కన్వీనర్గా ప్రొఫెసర్ బీ విజయలక్ష్మి (ఓ యూ), ఎడ్సెట్ కన్వీనర్గా ప్రొఫెసర్ మృణాళిని (ఎంజీయూ), పీఈసెట్ కన్వీనర్గా ప్రొఫెసర్ రాజేశ్కుమార్ (శాతవాహన)ను కన్వీనర్లుగా నియమించారు.
వీరిలో ముగ్గురు తప్ప మిగ తావారంతా గతంలో బాధ్యతలు నిర్వహించిన వారే. ఏడు సెట్స్ కన్వీనర్లలో ముగ్గురు మహిళలే ఉండటం విశేషం. ప్రవేశ పరీక్షల షెడ్యూల్స్, వర్సి టీలు, కన్వీనర్లను ప్రకటించడంతో విద్యార్థులు సన్నద్ధతపై దృష్టి సారించనున్నారు. ఎప్సెట్ నోటిఫికేషన్ ఫిబ్రవరి రెండో వారంలో జారీ కానుండగా, ఇతర ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లనూ అదే నెలలో విడుదల చేస్తారు.