హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సోమవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఫిరాయించిన 8 మంది ఎమ్మెల్యేలపై ఆయన అనర్హత వేటు వేశారు. వైఎస్సార్సీపీ వేసిన పిటిషన్తో ఆ పార్టీని వీడిన ఆనం రామనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డిపైనా, టీడీపీ వేసిన పిటిషన్తో ఆ పార్టీని వీడిన మద్దాల గిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్పై అనర్హత వేటు వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.