హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): దేశంలో దాదాపు 3 లక్షల మంది బొగ్గుగని కార్మికుల కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ (సీఎంపీఎఫ్) ఖాతా వివరాలను పూర్తిస్థాయిలో డిజిటలైజ్ చేయనున్నామని, అతి త్వరలో ఒక యాప్ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నామని సీఎంపీఎఫ్ కేంద్ర కమిషనర్ వీకే మిశ్రా తెలిపారు. దీనివల్ల ప్రతి కార్మికుడికి తన సెల్ ఫోన్లోనే పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. బుధవారం గోదావరిఖనిలో సింగరేణి యాజమాన్యం, కార్మిక సంఘాల నాయకులతో కలిపి నిర్వహించిన త్రైపాక్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు.
పూర్తిస్థాయి డిజిటలీకరణకు ప్రతి కంపెనీ నుంచి కార్మికుల సమాచారం, నామినీల సమాచారం వెంటనే అందజేయాలని కోరారు. అలాగే కార్మిక సంఘాల అభిప్రాయాలను తెలుసుకోవాలన్న ఉద్దేశంతో దేశవ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు వీకే మిశ్రా పేరొన్నారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్) ఎన్ బలరామ్ మాట్లాడుతూ.. తమ కంపెనీలో కార్మికులకు సీఎంపీఎఫ్ను పదవీ విరమణ చేసిన వెంటనే అందజేసేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. రిటైర్ అయిన కార్మికుల పింఛన్ తదితర సమస్యల పరిషారానికి ఏరియా టెర్మినల్ బెనిఫిట్ సెల్స్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు.