హైదరాబాద్, నవంబర్ 30: దేశీయ టైల్స్, స్టోన్ ఇన్స్టాలేషన్ ఉత్పత్తుల విభాగంలో అగ్రగామి హైదరాబాదీ సంస్థ ఎంవైకే లాటిక్రెట్..ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనిని జాతీయ ప్రచారకర్తగా నియమించుకున్నది. ఈ సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మురళీ యాదమ మాట్లాడుతూ..దేశీయంగా బ్రాండ్ను మరింత ప్రమోటింగ్ చేయాలనే ఉద్దేశంతో ధోనిని ప్రచారకర్తగా నియమించుకున్నట్లు చెప్పారు. వ్యాపార విస్తరణలో భాగంగా వచ్చే ఏడాదికాలంలో ఉత్తర భారతంలో ఉన్న వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడానికి రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల పెట్టుబడితో అక్కడ మూడు యూనిట్లను నెలకొల్పనున్నట్లు చెప్పారు. దీంతో కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 1,000 నుంచి 1,500కి చేరుకోనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సంస్థకు హైదరాబాద్తోపాటు ఐదు ప్లాంట్లు ఉన్నాయి.