హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పోలీస్శాఖకు చెందిన భూములు, ఖాళీ స్థలాలను పరిరక్షించేందుకు ఆ శాఖ కొత్తగా డిజిటల్ వ్యవస్థను రూపొందించింది. భవిష్యత్తులో పోలీస్ భూములు ఆక్రమణలు కాకుండా డిజిటల్ ల్యాండ్ రికార్డ్ చేసేందుకు జియో ఫెన్సింగ్ తీసుకొచ్చింది. పోలీస్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను సోమవారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో డీజీపీ మహేందర్రెడ్డి ప్రారంభించారు. జియో స్పేషియల్ టెక్నాలజీని ఉపయోగించి తకువ సమయంలో పోలీస్ భూములను డిజిటల్ ల్యాండ్ రికార్డుల్లో నమోదు చేసినట్టు డీజీపీ చెప్పారు. రాష్ట్రంలో 54 పోలీసు యూనిట్లకు చెందిన 953 ఆస్తులున్నాయని తెలిపారు. తెలంగాణ స్టేట్ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్స్ సెంటర్తో కలిసి అత్యంత ఆధునిక టెక్నాలజీలను ఉపయోగించి పోలీస్శాఖ ఈ ల్యాండ్ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను అతి తకువ వ్యవధిలోనే అభివృద్ధి చేసిందని చెప్పారు.