కన్నాయిగూడెం, డిసెంబర్ 27: ములుగు జిల్లాలోని దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు ఫేజ్-3లో సాంకేతిక సమస్య ఏర్పడటంతో బుధవారం మోటర్లు నిలిచిపోయాయి. ఫేజ్-2లోని ఒక మోటర్ ద్వారా పంపింగ్ కొనసాగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు దేవాదుల మోటర్ల ద్వారా 4.467 టీఎంసీల నీటిని పంపింగ్ చేసినట్టు తెలిపారు.