హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ ప్రయాణికులు గడువులోగా పాస్పోర్టులు పునరుద్ధరించుకోవాలని రీజినల్ పాస్పోర్టు అధికారి దాసరి బాలయ్య శుక్రవారం పలు మార్గదర్శకాలను విడుదల చేశారు. గడువు ముగియకముందే పునరుద్ధరణ తప్పనిసరని, దరఖాస్తుదారులందరూ అధికారిక పోర్టల్ www.passportindia. gov.in ను మాత్రమే ఉపయోగించుకోవాలని కోరారు. ప్రత్యామ్నాయంగా అధికారిక మొబైల్ యాప్ mPassport ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్ స్టోర్లనుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. హైదరాబాద్లోని మూడు, నిజామాబాద్లోని ఒక పాస్పోర్టు సేవా కేంద్రాలు (PSK), కరీంనగర్లోని పాస్పోర్టు సేవా లఘు కేంద్రం (PSLK), రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14 పోస్టాఫీస్ పాస్పోర్టు సేవాకేంద్రాల్లో (POPSK) పాస్పోర్టు సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మధ్యవర్తులకు ఎక్కువ డబ్బులు చెల్లించి మోసపోవద్దని హెచ్చరించారు. org, .in, .com పేర్లతో ఉన్న ఫేక్ వెబ్సైట్ల లింకులను ఓపెన్ చేయరాదని సూచించారు. సందేహాలుంటే నేషనల్ కాల్సెంటర్ 1800-258-1800లో సంప్రదించాలని రీజినల్ పాస్పోర్టు ఆఫీసర్ దాసరి బాలయ్య సూచించారు.