నారాయణపేట : దామరగిద్ద మండల తహసీల్దార్ వెంకటేశ్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. మండల పరిధిలోని అన్నాసాగర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఇటీవల నాన్ అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అయితే ఆ రిజిస్ట్రేషన్పై తహసీల్దార్ సంతకాలు లేకపోవడంతో.. బాధిత వ్యక్తి వారం రోజుల క్రితం ఆయన కార్యాలయాన్ని సంప్రదించారు. రూ. 10 వేలు లంచం ఇస్తేనే స్టాంప్ వేస్తానని తహసీల్దార్.. బాధిత వ్యక్తికి చెప్పాడు. ఇక చేసేదేమీ లేక బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఇవాళ వెంకటేశ్ రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం తహసీల్దార్ ఆఫీస్తో పాటు ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.