న్యూఢిల్లీ: సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) చీఫ్గా సీనియర్ ఐపీఎస్ అధికారి దల్జీత్ సింగ్ చౌదరిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన 1990 బ్యాచ్కు చెందిన ఉత్తర ప్రదేశ్ కేడర్ అధికారి. ప్రస్తుతం ఆయన సీఆర్పీఎఫ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్గా పని చేస్తున్నారు. పదవీ విరమణ తేదీ 2025 నవంబరు 30 వరకు ఆయ న ఈ పదవిలో కొనసాగవచ్చు. భూటా న్, నేపాల్, భారత్ సరిహద్దుల్లో రక్షణ బాధ్యతలను ఎస్ఎస్బీ నిర్వహిస్తుంది.