ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు
హైదరాబాద్/తెలుగుయూనివర్సిటీ, ఆగస్టు 13( నమస్తే తెలంగాణ): దళిత బంధు దేశానికే ఆదర్శమని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. అట్టడుగున ఉన్న దళితులను పైకి తీసుకరావాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తీసుకవచ్చారని చెప్పారు. శుక్రవారం రెడ్హిల్స్లోని ఎఫ్టీసీసీఐ ఆడిటోరియంలో మాదిగ ఇండస్ట్రియల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎంఐసీసీఐ) ఆధ్వర్యంలో దళిత బంధు సద్వినియోగంపై నిర్వహించిన సదస్సకు బాలరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ.. దళితులందరు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఎంఐసీసీఐ గౌరవ అధ్యక్షుడిగా బాలరాజును నియమించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములు, ఎంఐసీసీఐ వ్యవస్థాపక చైర్మన్ మహేశ్, అధ్యక్షుడు రాజ్కుమార్, జంగా సుదర్శన్, బక్క నరసింహులు, నరసింహారావు, సాయి, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.