యాదాద్రి భువనగిరి : దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా తెలంగాణలో అమలవుతున్న దళిత బంధు పథకాన్ని పంజాబ్ మంత్రి, అధికారులు ప్రశంసించారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన మంత్రి డాక్టర్ బల్జిత్ కౌర్(Punjab Minister Baljit Kaur), సంబంధిత అధికారులు సీఎం కేసీఆర్(CM KCR) దత్తత గ్రామం వాసాల మర్రిని శనివారం సందర్శించారు. గ్రామంలో దళిత బంధు(Dalit Bandu) లబ్ధిదారుల యూనిట్ల(Units)ను పరిశీలించారు.
ఈ సందర్శంగా దళిత బంధు లబ్ధిదారులతో మంత్రి మాట్లాడారు. దళిత బంధు ఏర్పాటుకు ముందు, ప్రస్తుతం లబ్ధిదారుల ఆర్థిక పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. దళిత బంధు పథకం అధ్యయనం చేసేందుకు ఇక్కడికి వచ్చామని ఈ పథకాన్ని పంజాబ్(Punjab) లో ప్రవేశ పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆమె వెల్లడించారు. తెలంగాణలో అమలు చేస్తున్న దళితబంధు అపూర్వమని కొనియాడారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ దీపక్ తివారి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్, సర్పంచ్ పోగుల ఆంజనేయులు తదితరులు ఉన్నారు.