Cyberabad data leak | సైబరాబాద్ పోలీసులు వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేసిన విషయం తెలిసిందే. దాదాపు 16కోట్ల మంది భారతీయులకు సంబంధించిన డేటాను చోరీ చేసి అమ్మినట్లుగా విచారణలో గుర్తించారు. ముఠాను పట్టుకొని కేసు నమోదు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే, ప్రజల వ్యక్తిగత సమాచారం ఎక్కడ ఇచ్చినా అక్రమార్కుల చేతిలోకి వెళ్లున్న నేపథ్యంలో మరోసారి వ్యక్తిగత సమాచారం భద్రత మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో చర్చ జరిగింది.
సైబరాబాద్ పోలీసులు చాకచక్యంగా ఈ ముఠాను పట్టుకోవటంతో ఈ డేటా లీక్ స్కామ్ వెలుగు చూసిందంటూ సోషల్ మీడియాలో అభినందిస్తున్నారు. అదే సమయంలో ప్రధానితో పాటు ఇతర రాజకీయ నాయకులను సోషల్ మీడియా వేదికగా డేటా ప్రొటెక్షన్ తేవాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో చట్టం చేసి వ్యక్తిగత సమాచారాన్ని అక్రమార్కుల చేతుల్లో పడకుండా రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ఈ విషయంపై శనివారం ట్విట్టర్లో #CybPoliceBustedDataLeak పేరుతో ట్రెండ్ అయ్యింది.