హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): వచ్చే విద్యాసంవత్సరంలో డిగ్రీలో సైబర్ సెక్యూరిటీ కోర్సును ప్రవేశ పెట్టాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. సైబర్ నేరాలపై అవగాహన కల్పించడమేగాక, వాటిని అరికట్టే యోధులను తయారుచేసేందుకు ఈ కోర్సును ప్రవేశపెట్టనున్నట్టు తెలిపింది. ఉస్మానియా, నల్సార్ వర్సిటీ విషయ నిపుణులచే సైబర్ సెక్యూరిటీ కోర్సును రూపొందించినట్టు పేర్కొన్నది. గురువారం హైదరాబాద్లో నిర్వహించిన వీసీల సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, కళాశాల విద్య కమిషనర్ నవీన్మిట్టల్, పలు వర్సిటీల వీసీలు ప్రొఫెసర్ రవీందర్, గోపాల్రెడ్డి, మల్లేశ్, రవీందర్గుప్తా, లక్ష్మీకాంత్ రాథోడ్ మరిన్ని నిర్ణయాలు తీసుకొన్నారు. ఈ విద్యా సంవత్సరంలోనే డిగ్రీ కోర్సులను ప్రారంభించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.
ఉన్నత విద్యామండలి నిర్ణయాలు