హైదరాబాద్ : కొవిడ్ వ్యాక్సినేషన్ పురోగతిపై సమీక్షించేందుకు సీఎస్ సోమేశ్కుమార్ జిల్లాల బాటపట్టారు. ఈ నెలాఖరు వరకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. ఆయన వ్యాక్సినేషన్ పురోగతిని సమీక్షించడంతో పాటు మరింత వేగవంతం చేసేందుకు శుక్రవారం పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం హెలికాప్టర్లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకొని ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు, వైద్యాధికారులు, ఇతరశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
వ్యాక్సినేషన్ కొనసాగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. టీకాల పంపిణీని వేగవంతం చేసి, నెలాఖరు వరకు లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. అనంతరం మధ్యాహ్నం అక్కడి నుంచి మహబూబ్నగర్కు బయలుదేరి వెళ్లారు. అక్కడ నాగర్కర్నూల్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నారాయణపేట కలెక్టర్లు, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నారాయణపేట జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. ఆదిలాబాద్లో జరిగిన సమీక్షలో సమాశంలో జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు, స్థానిక మున్సిపల్ కమిషనర్లు, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.