వ్యవసాయ యూనివర్సిటీ, జూన్ 25 : పంట వ్యర్థ్దాల కాల్చివేత ప్రతి ఏడాదీ పెరుగుతూ ఉన్నదని, ఇలాగే కొనసాగితే భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అల్దాస్ జానయ్య హెచ్చరించారు. రైతులు పంట వ్యర్థాలను కాల్చవద్దని సూచించారు. యూనివర్సిటీలో ఇటీవల నెలకొల్పిన అధునాతన ప్రయోగశాలలో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఉపగ్రహ ఛాయా చిత్రాలను విశ్లేషించి గురువారం గణాంకాలు విడుదల చేశారు.
రాష్ట్రంలోని 17 లక్షల ఎకరాల్లో పంట వ్యర్థ్దాలను కాల్చినట్టు వెల్లడించారు. తెలంగాణాలో అత్యధిక పంట వ్య ర్థ్దాలను కాల్చివేసిన మొదటి 5 స్థానాల్లో నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, పెద్దపల్లి ఉన్నట్టు వెల్లడించారు. వ్యర్థ్దాలను కాల్చివేయడంవల్ల నేల ఆరోగ్యం, గాలి నా ణ్యత తీవ్రంగా కలుషితం అవుతునాయని పేర్కొన్నారు.