బంజారాహిల్స్, డిసెంబర్ 25: నిర్మాణ పనుల బిల్లులు చెల్లించలేదనే అభియోగంపై ఆదిత్య కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ తోట సత్యనారాయణపై కోర్టు ఆదేశాల మేరకు ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. షేక్పేట సమీపంలోని టోలీచౌకి పురానాబాగ్లో సుమారు 19 వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఈ సంస్థ చేపట్టిన పనుల్లో హెచ్ బ్లాక్లో 220 ఫ్లాట్స్ నిర్మాణాన్ని ఎస్ఎస్టీ బిల్డర్స్ ఎల్ఎల్పీ, శ్రీ సాయి తిరుమల కన్స్ట్రక్షన్స్ సంస్థకు అప్పగించింది.
రూ.కోట్లు ఖర్చు పెట్టి నిర్మాణాలు పూర్తిచేసిన తమకు బిల్లులు చెల్లించకపోగా సదరు ఫ్లాట్స్ను పంజాబ్ నేషనల్ బ్యాంక్లో మార్టిగేజ్ పెట్టి లోన్స్ తీసుకొని సంస్థ డైరెక్టర్ సత్యనారాయణ మోసానికి పాల్పడ్డారని ఎస్ఎస్టీ ఎల్ఎల్పీ మేనేజింగ్ భాగస్వామి వాకాడ తిరుమలరావు ఇటీవల కోర్టును ఆశ్రయించారు.