హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): మానవహక్కుల కార్యకర్త, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను, అతనితో పాటు కేసులో ఉన్న ఐదుగురిని బాంబే హైకోర్టు నిర్దోషిగా తీర్పునివ్వడం పట్ల సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శుక్రవారం హర్షం వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యంలో మేధావులను, ప్రజల కోసం పనిచేస్తున్న నాయకులను, ప్రజాసంఘాల కార్యకర్తలను మోదీ ప్రభుత్వం తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నదని తమ్మినేని విమర్శించారు. తక్షణమే సాయిబాబాను విడుదల చేయాలన్నారు.